ఆరు జిల్లాల్లో మాత్రం… అప్పటి వరకూ అంతే

తెలంగాణలో ఆరు జిల్లాల్లో మే 17 వ తేదీ వరకూ లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రెడ్ జోన్ పరిధిలోకి తెలంగాణలోని హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, [more]

Update: 2020-05-02 02:01 GMT

తెలంగాణలో ఆరు జిల్లాల్లో మే 17 వ తేదీ వరకూ లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రెడ్ జోన్ పరిధిలోకి తెలంగాణలోని హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలున్నాయి. ఈ ఆరు జిల్లాల్లో మే 17వ తేదీ వరకూ ఎలాంటి కార్యకలాపాలు జరగవు. మే 5వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చని సడలింపులపై చర్చించనున్నారు. మిగిలిన జిల్లాల్లో యధావిధిగా కార్యకలాపాలు జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News