టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-01-29 13:00 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి)

High Court : నేడు గంటా రాజీనామా ఆమోదంపై విచారణ

టీడీపీ ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ ఆమోదించడంపై వేసిన పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రాజీనామా చేశారు.

Gold Prices : రెండు రోజులే సమయం.. వెయిట్ చేస్తే లాస్ తప్పదట... ఇక మీ ఇష్టం

బంగారం ధరలు నేడు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో పసిడిప్రియులు ఊరట చెందుతున్నారు. పసిడి పెరుగుతుందన్న కారణంతో ముందుగా కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి తరుణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Janasena : నేడు అనకాపల్లిలో కొణతాల ఆత్మీయ సమావేశం

ఈరోజు అనకాపల్లిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొణతాల రామకృష్ణ పాల్గొననున్నారు. అనకాపల్లిలో జరగనున్న ఆత్మీయ సమావేశానికి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి జనసైనికులతో పాటు ముఖ్య నేతలు రావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి

Ayodhya : అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు

అయోధ్య బాల రాముడిని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. దీంతో అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు గంటల సమయం పడుతుంది.

Budget : మము బ్రోవమని చెప్పమ్మా ...సీతమ్మ తల్లీ.. దయ చూపించవూ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో రెండు రోజుల్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్ ప్రకటన ఉండనుంది.

Galla Jayadev : గల్లా జయదేవ్ ప్రకటన అందుకేనట.. అది జరగకుంటే ఈసారి కూడా పోటీ చేసేవారట

గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే బ్రేక్ ఎంత కాలం? అన్నది మాత్రం తెలియదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పారు.

తగినంత నిద్ర లేకుంటే గుండెపై ఒత్తిడి పెరుగుతుందా?

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం . తగినంత లేదా నాణ్యత లేని నిద్ర అధిక రక్తపోటు, గుండె జబ్బులతో సంబంధం కలిగి ఉంటుంది. దురదృష్టవశాత్తు, చాలా మందికి తగినంత నిద్ర ఉండటం లేదు.

ఒకే జిల్లా.. ఒకే ఉత్పత్తి కాన్సెప్టు.. ఏపీకి అవార్డుల పంట.. చేతి వృత్తులకు ఉపాధి అవకాశాలు

ఏపీ ప్రభుత్వం అభివృద్ది పథంలో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యలు చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల వారికి చేయూతనిచ్చే పథకాలను అమలు చేస్తున్నారు.

Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ చేస్తానంటున్న రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే, మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా సైన్ చేస్తున్నారు.

Revanth Reddy : వారానికి మూడు రోజులకు జిల్లాలకు

వచ్చే నెల రెండో తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది.


Tags:    

Similar News