చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కుమారస్వామి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో జరగనున్న [more]

Update: 2019-05-21 07:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో జరగనున్న బీజేపీయేతర పక్షాల భేటీ, ఎన్నికల సంఘం వద్ద నిరసన కార్యక్రమానికి కుమారస్వామి హాజరుకావాల్సి ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఆయన పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇవాళ ఢిల్లీకి వెళ్లడం లేదు. నిన్న డీఎంకే చీఫ్ స్టాలిన్ సైతం 23న జరగాల్సిన విపక్షాల సమావేశానికి హాజరుకావడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. మాయావతి సైతం నిన్న సోనియా గాంధీతో జరగాల్సిన భేటీని రద్దు చేసుకున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో బీజేపీయేతర పక్షాలు కొంత పునరాలోచనలో పడ్డాయి.

Tags:    

Similar News