పొత్తులపై కన్నా తేల్చేశారు

తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకోకుండానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు చేసే దుష్ప్రచారాలను [more]

Update: 2019-01-02 12:22 GMT

తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకోకుండానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఒంటరిగా పోటీచేసే శక్తి తమకు ఉందన్నారు. తెలంగాణలో కూడా ఒంటరిగా పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ఏపీ విభజన హామీలను ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులను కేంద్రం ఏపీకి ఇచ్చిందన్న ఆయన చంద్రబాబు ప్రజలను తప్పుడు లెక్కలు చెబుతూ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యేంతర శక్తులుగా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. చంద్రబాబు తన జీవితంలో ఎన్నడూ నిజం చెప్పలేదన్నారు. చంద్రబాబు చేసే ప్రతి పనిలో రాజకీయం ఉంటుందన్నారు.

Tags:    

Similar News