ఎట్టకేలకు ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్

ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకున్నట్లు తెలిసిన వెంటనే నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. అలాగే మస్క్ ను పలు సరదా ప్రశ్నలు

Update: 2022-04-26 03:54 GMT

న్యూ ఢిల్లీ : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత అయిన ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20 డాలర్ల చొప్పున మొత్తం షేర్లను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు ఎలాన్ మస్క్. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. ట్విట్టర్ ను వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన సోషల్ మీడియా వేదికగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకున్నట్లు తెలిసిన వెంటనే నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. అలాగే మస్క్ ను పలు సరదా ప్రశ్నలు అడిగారు. 'మస్క్.. నన్ను స్పేస్ నుంచి ట్వీట్ చేయనిస్తారా?' అని ఒకరు అడిగితే, 'బ్యాన్ చేసిన ఖాతాల్లో తొలుత మీరు దేనిని పునరుద్ధరిస్తారు?' అని మరొకరు ప్రశ్నించారు. ట్విట్టర్‌ను 'హేట్ స్పీచ్'కు వేదికగా మార్చొద్దని ఇంకొకరు కోరారు. మరో యూజర్ అయితే శ్రీలంక సంక్షోభం గురించి ప్రస్తావించారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఖర్చు చేసిన మొత్తం.. శ్రీలంక సంక్షోభానికి కారణమైన అప్పులతో సమానమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ట్విట్టర్ కొనుగోలు ఒప్పంద వార్తల నేపథ్యంలో నిన్న ట్విట్టర్ షేర్ల విలువ 3 శాతం పెరిగింది.


Tags:    

Similar News