బాబు చేతకాని తనం వల్లనేనా?

చంద్రబాబు తన చేతకాని తనాన్ని ఇతరులపై రుద్దుతున్నారని బీజేపీ అధికారప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. హైకోర్టు విభజన జగన్ కోసమే చేశారనడం అబద్ధం కాదా? [more]

Update: 2018-12-29 06:57 GMT

చంద్రబాబు తన చేతకాని తనాన్ని ఇతరులపై రుద్దుతున్నారని బీజేపీ అధికారప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. హైకోర్టు విభజన జగన్ కోసమే చేశారనడం అబద్ధం కాదా? అని ప్రశ్నించారు. న్యాయవాదులకు, ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన జరుగుతుందని తెలిసినా, రెండతస్థుల భవనం రెండు నెలలో నిర్మించడం చేతకాని తనం కాదా? అని నిలదీశారు. రాజకీయంగా రచ్చ చేయడానికే తప్ప, చిల్లర రాజకీయాలు చేయడం కోసమే తప్ప మరేంకాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రతిపక్ష నాయకుడు తప్ప చంద్రబాబుకు ఏమీ కన్పించలేదన్నారు. మీ ఓటుకు నోటు కేసులు ముందుకు జరగడం లేదన్న విషయంలో రహస్యం ఏందో చెబుతారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక హైకోర్టు కావాలంటే రెండు నెలలు ముందే ఈ నిర్ణయం కేంద్రప్రభుత్వం తీసుకుందన్నారు. చంద్రబాబుపై ఉన్న అభియోగాలు, కేసులు ఇంత వరకూ విచారణకు రావని, ప్రతిపక్ష నేతను మాత్రం వారం రోజుల్లో విచారించి లోపల వేయాలన్నది చంద్రబాబు అభిమతమన్నారు.

Tags:    

Similar News