చంద్రబాబు అప్పుడే విశాఖకు వస్తారు

ఏడాది పాలనపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని, సరైన సందర్భంలో చెబుతానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన తన నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. [more]

Update: 2020-05-26 07:17 GMT

ఏడాది పాలనపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని, సరైన సందర్భంలో చెబుతానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన తన నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీటీడీ భూములను అమ్మడం సరికాదని చెప్పారు. అది ఏ పార్టీ హయాంలో జరిగినా తాను సమర్థించనని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అలాగే అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై కూడా నో కామెంట్స్ అని స్పందించారు. చంద్రబాబు మహానాడు తర్వాత విశాఖలో పర్యటిస్తారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తారని చెప్పారు.

Tags:    

Similar News