గల్లా కుటుంబానికి జగన్ ఆ విధంగా

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ షాకిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్ ఫ్రా టెక్ [more]

Update: 2020-07-01 05:16 GMT

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ షాకిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్ ఫ్రా టెక్ కు ిచ్చని 253 ఎకరాల స్థలాన్ని వెనక్కు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీఐఐసీ ఆదేశాలు జారీచేసింది. అమరరాజా కంపెనీకి గత ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో 483 ఎకరాలను కేటాయించింది. రెండేళ్లలోగా ఈ భూమిని అమరరాజా కంపెనీ ఉపయోగించుకోవాల్సి ఉంది. అయితే నిబంధనల ప్రకారం ఇప్పటి వరకూ ఉపయోగించుకోని 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని విలువ 60 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News