నేడు దేశ వ్యాప్తంగా రైల్ రోకో

మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రైల్ రోకో కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం [more]

Update: 2021-02-18 05:41 GMT

మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రైల్ రోకో కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రైల్ రోకో చేయాలని పిలుపు నిచ్చారు. దేశ వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం జరుగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి రైతు సంఘాలు భరోసా నిచ్చాయి. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ల వద్ద భారీ బలగాలను మొహరించారు.

Tags:    

Similar News