బూతు మంత్రులను ప్రజలు క్షమించరు

అసభ్య పదజాలంతో దూషిస్తున్న మంత్రులను ప్రజలు క్షమించరని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మంత్రి కొడాలి నాని అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలు [more]

Update: 2019-11-29 05:34 GMT

అసభ్య పదజాలంతో దూషిస్తున్న మంత్రులను ప్రజలు క్షమించరని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మంత్రి కొడాలి నాని అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలు ఐదు నెలల్లోనే శృతి మించిపోయాయన్నారు. చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటనను వైసీపీ రాద్ధాంతం చేసిందన్నారు. పాలించడం చేతకాక అసహనంతోనే మంత్రులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుంటే వైసీపీ భూస్థాపితం అవుతుందని దేవినేని ఉమ అన్నారు.

Tags:    

Similar News