బ్రేకింగ్ : ఏపీలో యాభై వేలు మార్క్ దాటేసిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు కొత్తగా 4074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 54 [more]

Update: 2020-07-20 13:11 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు కొత్తగా 4074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 54 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 53,724కు చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 696కు చేరుకుంది. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,086 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News