బిగ్ బ్రేకింగ్ : రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై

ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో రాబోయే ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కోబోతోందని, అందుకు..

Update: 2023-02-25 11:53 GMT

sonia gandhi says good bye to politics

కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాలుగా ముందుండి నడిపించిన పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. తన రాజకీయ జీవితం భారత్ జోడోయాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందని, ఇది పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ అని సోనియా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటించిన ఆమె.. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సోనియా 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ ప్రజలు సహనం, సమానత్వం, సామరస్యం కోరుకుంటున్నారని భారత్ జోడో యాత్రద్వారా రుజువైందన్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో రాబోయే ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కోబోతోందని, అందుకు పార్టీ శ్రేణులంతా సన్నద్ధమవ్వాలని సోనియా పిలుపునిచ్చారు. "మనమంతా క్రమశిక్షణతో పనిచేద్దాం. గతంలో ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదాం. పార్టీ గెలుపు అంటే దేశానికి విజయం మాత్రమే కాదు. మనలో ప్రతి ఒక్కరి విజయం అని గుర్తుంచుకుందాం." అని సోనియా తెలిపారు.


Tags:    

Similar News