నేడు గవర్నర్ వద్దకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గవర్నర్ ను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్ ను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు [more]

Update: 2020-06-18 02:18 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గవర్నర్ ను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్ ను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు గవర్నర్ దృష్టికి తేనున్నారు. రాజ్యాంగం ఉల్లంఘనతో పాటు, టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించడాన్ని చంద్రబాబు గవర్నర్ కు వివరించనున్నారు. బలహీన వర్గాలు, దళితులపై ఈ ప్రభుత్వంలో ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పనున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ముగ్గురు బీసీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని వివరించనున్నారు.

Tags:    

Similar News