Sankranthi : నేటి నుంచి సంక్రాంతి సంబరాలు మూడు రోజులు.. విశిష్టతలివే
సంక్రాంతి పండగ అంటే మూడు రోజుల పండగ.
సంక్రాంతి పండగ అంటే మూడు రోజుల పండగ. అందుకే ఈ మూడు రోజులు పండగ చేసుకోవడానికి విదేశాల నుంచి కూడా మనోళ్లు వస్తారు. సంక్రాంతి పండగ అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, భోగిపండ్లు,హరిదాసులు, కనుమరోజు కమ్మటి విందు భోజనాలు ఇవీ. అయితే సంక్రాంతి అంటే పెద్దలు అనేకరకాలుగా చెబుతుంటారు. అందులో మూడు రోజుల పండగలో ఎన్నో విశేషాలు.. ఎన్నో విషయాలు.
భోగి అంటే...
భోగి అంటే భోగం అనుభవించే రోజు అని అర్ధం. ధాన్యం రైతు ఇంటికి వస్తుంది అది చూసి రైతు సంతోషం గా ఉంటాడు, గడ్డి గాదం వస్తుంది కాబట్టి పశు ప్రాణులు సంతోషం గా ఉంటాయి కాబాట్టి భోగం అనుభవించే రోజు కాబట్టి భోగి అంటారు. ఇంకో పేరు ఆనంద భొవిందము అని అంటారు, భోగి కి తిధి ఉండదు ఎందుకంటే దక్షిణాయం ఏ తిధి నాడు పూర్తి అవుతుందో అది భోగి. దక్షిణయాం లో ప్రకృతి సహకరించదు వానలు వరదలు మంచు లాంటివి ఉంటాయి అందుకే ఆ సమయం లో ఉపాసన చేసి దేవుని కటాక్షం పొందాలంటారు. సంక్రాంతి కి నెలరోజుల ముందు నుండి కన్నె పిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టీయటం ఆనవాయితీ,నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలను ఎండిన తరువాత భోగి రోజున అగ్ని లో కలుపుతారు. ఎందుకు అగ్ని లో కలుపుతారు అంటే మంచి ఆలోచనలు ధార్మికమైయినా అభివృద్ధి ను అగ్ని దేవుడు ఇస్తాడని చెబుతారు.
మకర సంక్రాంతి రోజు...
భోగి పండగ రోజు పిల్లల లకు భోగి పళ్ళు పోస్తారు ఎందుకు అంటే గత జన్మల చెడు ఖర్మలు, పాపాలు పోవటానికి చెరుకు ముక్క, భోగి పళ్ళు, చిల్లర కలిపి తల నుండి కిందకి పోస్తారు దీని వలన పీడ పోయి భోగములు అనుభవించ వలసిన శక్తి పొందుతారు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర సంక్రాంతి లోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయం మరియు ఉత్తరాయం. దక్షిణాయం లో దేవతలు నిద్ర పోతారు, ఉత్తరాయణం లో నిద్ర లేస్తారు ఆ రోజు తెల్లవారు జామున నదీ స్నానం చేస్తే చాల పుణ్యమని చెబుతారు. ఈ కాలం లో దానం చేయటం చాలా శ్రేష్టమని చెబుతారు. సాక్షాత్తూ మహా విష్ణువ్వు ఈ రూపం లో మన ఇళ్ల దగ్గరకు అతిధుల రూపం లో వస్తారు అని అంటారు. దానం చేసి త్యాగం చేయటం నేర్చుకో ఇది మన అభ్యున్నతి కి తోడ్పాటును కలుగచేస్తాయనిపెద్దలు చెబుతారు.
కనుమ రోజు...
అందరు బాగుండాలి, అన్ని జీవరాసులు బాగుండాలి అని పక్షి పూజ పశు పూజ చేసి మనం తినే అన్నం పాయసం దానికి పెట్టి మనతో పాటు వాటి కి కూడా భోగం అనుభవించే లా చేయాలి , అందుకే పంట రాగానే కొన్ని కంకుల ను గుత్తు లా కట్టి ఇంటి బయటా దేవాలయాల్లో వేలాడ తీస్తారు అవి పక్షుల కోసం. ఇంట్లో ఉన్న పశువులను పూజిస్తారు,పూలు కడతారు అందరు అన్ని జీవ రాసులు బాగుండాలి అని అని కనుమ పండుగను చేసుకుంటారు. కనుమ రోజు నాన్ వెజ్ వంటకాలను చేసుకుని తినడం ఆనవాయితీగా వస్తుంది. కనుమ రోజుతో సంక్రాంతి మూడు రోజుల వేడుక ముగియనుంది. పశువులను అందంగా తీర్చిదిద్ది వాటికి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తుంది.