పులివెందుల విషయంలో చంద్రబాబు స్పీడ్ డెసిషన్

పులివెందుల ఇన్ ఛార్జిగా సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. సతీష్ రెడ్డి రాజీనామాను ఆయన ఆమోదించారు. వెంటనే పులివెందులకు బీటెక్ రవిని [more]

Update: 2020-03-11 01:46 GMT

పులివెందుల ఇన్ ఛార్జిగా సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. సతీష్ రెడ్డి రాజీనామాను ఆయన ఆమోదించారు. వెంటనే పులివెందులకు బీటెక్ రవిని పులివెందుల ఇన్ ఛార్జిగా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు బీటెక్ రవి, కడప జిల్ల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. సతీష్ రెడ్డి రాజీనామాకు గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. నేతలు పార్టీని వీడి వెళ్లినా ఇబ్బంది లేదని, క్యాడర్ కు అండగా ఉండాలని బీటెక్ రవిని చంద్రబాబు ఆదేశించారు. తాను పులివెందుల బాధ్యతలను తీసుకుంటానని బీటెక్ రవి చంద్రబాబుకు తెలిపారు.

Tags:    

Similar News