జగన్ పైశాచికానందం పొందుతున్నాడు

మూడు రాజధానులను చెప్పి ముఖ్యమంత్రి జగన్ పైశాచికానందం పొందుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు త్యాగాన్ని జగన్ [more]

Update: 2020-01-15 07:31 GMT

మూడు రాజధానులను చెప్పి ముఖ్యమంత్రి జగన్ పైశాచికానందం పొందుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు త్యాగాన్ని జగన్ గుర్తించలేదన్నారు. రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని, ఐదుకోట్ల మంది అభిలాష అని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఈసారి సంక్రాంతి జరుపుకోవడం లేదన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి అమరావతిని సాధించుకుందామని చెప్పారు.

Tags:    

Similar News