జగన్ వల్ల వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు

తప్పులు చేసేవారికి, నేరస్థులకే వైసీపీలో చోటుంటుందని, వైసీపీలో ఉండాలంటే తప్పులు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… [more]

Update: 2019-03-06 06:13 GMT

తప్పులు చేసేవారికి, నేరస్థులకే వైసీపీలో చోటుంటుందని, వైసీపీలో ఉండాలంటే తప్పులు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… తప్పులు, నేరాలు చేసి జైళ్లకు వెళ్లడం, శిక్ష అనుభవిస్తుండటం జగన్ కు అలవాటేనన్నారు. జగన్ వల్ల ఎందరో కేసుల్లో చిక్కుకొని జీవితాంతం మానసిక క్షోభను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. మంచి నాయకులను తీర్చిదిద్దే బాధ్యత తనదని, త్వరలోనే 25 వేల మంది సేవా మిత్రలతో సమావేశమవుతానని తెలిపారు. అన్ని కులాలు అన్నదమ్ముల్లా మెలగాలని, సామాజిక న్యాయమే తెలుగుదేశం సిద్ధాంతమని అన్నారు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

Tags:    

Similar News