అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

కరోనా తర్వాత ప్రారంభమయిన పాఠశాలలకు 74 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 83 శాతం మంది [more]

Update: 2021-08-27 06:29 GMT

కరోనా తర్వాత ప్రారంభమయిన పాఠశాలలకు 74 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 83 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఉపాధ్యాయులకు 95 శాతంత వ్యాక్సినేషన్ ను పూర్తి చేశామని మంత్రి సురేష్ చెప్పారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత ప్రభుత్వ లక్ష్యమని సురేష్ తెలిపారు.

Tags:    

Similar News