Breaking : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు

లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు

Update: 2024-02-10 05:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది.

13న కాళేశ్వరానికి...
కానీ పన్నెండో తేదీ వరకే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావిస్తుంది. 13వ తేదీన కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానించాలని, ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. 13న నల్లగొండలో బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News