హ్యాండ్ ఇచ్చిన పార్టీ.. షాక్ ఇచ్చిన స్రవంతి

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని

Update: 2023-11-11 05:38 GMT

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం జరిగిన రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపించారు. నేడో రేపో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

మునుగోడు నియోజకవర్గానికి చెందిన కీలక నేత పాల్వాయి స్రవంతి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు స్రవంతి. తాజాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి రావటంతో ఆయనకే మునుగోడు టికెట్ ఇచ్చారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో స్రవంతి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News