చాలా రోజుల తర్వాత పది వేలకు దిగువన...?

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 197 మంది మరణించారు.

Update: 2021-11-16 04:51 GMT

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 197 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,38,61,756 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,30,793 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

పరీక్షలు ఇలా...
భారత్ లో ఇప్పటి వరకూ 3,44,56,410 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,63,852 మంది మరణించారు. రోజుకు దేశ వ్యాప్తంగా 11 లక్షలకు పైగా నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News