తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజే
తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 1,520 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 6,85,920 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఒమిక్రాన్ కూడా...
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,75,132 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 6,168 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,035 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.