సిరీస్ సమం అవుతుందా? తేడా కొడుతుందా?

న్యూజిలాండ్ తో భారత్ వన్డే మూడో మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.

Update: 2022-11-30 02:56 GMT

న్యూజిలాండ్ తో భారత్ వన్డే మూడో మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ లో ఒక మ్యాచ్ లో న్యూజిలాండ్ నెగ్గింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా టై అయింది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. సిరీస్ ను సమం చేయాలనుకుంటే భారత్ తప్పక గెలవాల్సి ఉంటుంది.

వర్షం పడితే...
అయితే చివరి మ్యాచ్ జరిగే క్రైస్ట్‌చర్చలో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షంపడి మూడో మ్యాచ్ రద్దయినా సిరీస్ ను న్యూజిలాండ్ గెలుచుకున్నట్లే. అందుకే వర్షం రాకూడదని భారతీయ క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. భారత్ జట్టులో పెద్దగా మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ లలో బలంగా ఉండటంతో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News