BCCI : టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ను ప్రకటించింది
IPL matches
టీం ఇండియా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ను ప్రకటించింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచినందుకు బీసీసీఐ 131 కోట్ల రూపాయలను బహుమతిగా ప్రకటించింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్స్ లో గెలిచన భారత్ మ్యాచ్ ను చూసిన కోట్లాది మంది భారతీయులు ఉప్పొంగిపోయారు. రెండోసారి ప్రపంచ కప్ ను టీం ఇండియా సొంతం చేసుకుంది.
సపోర్ట్ స్టాఫ్ కు కూడా...
బీసీసీఐ ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కు కూడా ఈ నజరానాను కూడా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో శ్రమించి విజయం సాధించినందుకు టీం ఇండియాకు ఈ నజరాను ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా టీం ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రపంచంలో మేటి జట్టుగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.