రోహిత్ కెప్టెన్సీ ... వరస విజయాలు

టీం ఇండియా రికార్డులు సొంతం చేసుకుంటుంది. శ్రీలంక పై రెండో టెస్ట్ ను గెలిచిన భారత్ సిరీస్ ను ముందుగానే కైవసం చేసుకుంది.

Update: 2022-03-15 03:30 GMT

టీం ఇండియా రికార్డులు సొంతం చేసుకుంటుంది. శ్రీలంక పై రెండో టెస్ట్ ను గెలిచిన భారత్ సిరీస్ ను ముందుగానే కైవసం చేసుకుంది. బెంగళూరులో జరిగిన రెండో పింక్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో స్వదేశంలో వరసగా పదిహేను సిరీస్ ను గెలిచిన జట్టుగా భారత్ రికార్డును సృష్టించింది. భారత్ చివరి సారిగా 2012లో సొంత గడ్డపై ఇంగ్లండ్ లో పరాజయం పాలయింది. అప్పటి నుంచి భారత్ టెస్ట్ మ్యాచ్ లలో వరస విజయాలను సాధిస్తూ వస్తుంది.

అన్ని ఫార్మాట్లలో...
రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్న తర్వాత భారత్ కు వరస విజయాలు దక్కుతున్నాయి. సొంత గడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ క్లీన్ స్పీప్ చేస్తుంది. ఇటీవల వెస్టిండీస్ పై జరిగిన అన్ని ఫార్మాట్లలో పై చేయి సాధించింది. ఇప్పుడు శ్రీలంకపై కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. అన్ని ఫార్మాట్లలో భారత్ దే పైచేయిగా నిలిచింది. రోహిత్ సారథ్యంలో భారత్ మరింతగా దూసుకుపోతుందని క్రీడా విశ్లేషకులు సయితం చెబుతున్నారు.


Tags:    

Similar News