Women's World Boxing Championship : భారత్ కు రెండు స్వర్ణాలు తెచ్చిన సావిటీ, నీతూ

Update: 2023-03-26 05:32 GMT

wpmen's worlds champion ship

2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది, స్టార్ రెజ్లర్లు సావీటీ బూరా, నీతూ ఘంఘాస్‌లు దేశం తరపున ఆడి రెండు బంగారు పతకాలను గెలుచుకున్నారు. 81 కేజీల విభాగంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎరీనాలో జరిగిన ఉత్కంఠభరితమైన సమ్మిట్ పోరులో చైనా క్రీడాకారిణి వాంగ్ లీనాను ఓడించి సావీటీ బూరా తన తొలి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కెనడాలో జరిగిన 2014 మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది. ఈ విజయం బూరాకు ఎంతో మధురమైనది.

అంతకుముందు 49 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెట్‌సెగ్‌ను 5-0 స్కోర్‌లైన్‌తో ఓడించి నీతు ఘంఘాస్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది నీతూకి మొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం. ఆమె టోర్నమెంట్ అంతటా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. తన పోరాటాలకు వ్యూహాత్మక, దూకుడు విధానాన్ని అవలంబించింది. మొత్తంమీద ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తమ ఆటతీరుతో ఆకట్టుకుని..బంగారు పతకాలను సాధించారు. బూరా, నీతూ సాధించిన బంగారు పతకాలు దేశ పతకాల సంఖ్యను మరింత పెంచేందుకు దోహదపడ్డాయి.


Tags:    

Similar News