IPL 2025 : ఫలించిన స్వప్నం.. ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఛాంపియన్ గా నిలిచింది

Update: 2025-06-04 01:28 GMT

అందరి ఆశలు ఫలించాయి. ప్రధానంగా కోహ్లి ఫ్యాన్స్ కు ఉన్న ఒకే ఒక కోరిక తీరిపోయింది. పద్దెనిమిదేళ్లుగా ఛాంపియన్ షిప్ కోసం ఎదురు చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల సాకారమయింది. ఎంత ఉత్కంఠ? చివర బంతి వరకూ టెన్షన్. అందరి కళ్లల్లో ఆనందంతో కూడిన నీళ్లు. ఒక్కసారి.. ఒక్కసారి తాము ఆరాధించే ఆటగాడి కళ్లల్లో ఆనందం చూడాలని ఏ అభిమానికి అయినా ఎవరికి ఉండదు? నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లి అభిమానులు ఆ ఆనందాన్ని చూశారు. కోహ్లి అనుభవించిన హ్యాపీనెస్ ను గ్రౌండ్ లో గెలిచిన తరుణంలో విరాట్ కళ్లలో నీళ్లు తిరగడం చూసి అభిమానులందరి గుండెలు బరువెక్కాయి. ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న కప్పు చేతికి వచ్చింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే కోహ్లి.. కోహ్లి అంటే బెంగళూరు.. అందువల్లనే ఆ జట్టుకు అంత ఫ్యాన్స్. ఎప్పటిలాగే దురదృష్టం వెంటాడుతుందన్న భయం లోపల. గెలవాలన్న తపన. తమ జట్టు అని భావించే బెంగళూరు గెలిస్తే చాలు అని ప్రార్థించిన వాళ్లు ఎందరో. అది వారి కోసం. కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం. అదే విరాట్ కోహ్లి కోసం. అంతటి అభిమానం సంపాదించుకున్న విరాట్ కోహ్లి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరకు 2018 ఐపీఎల్ చాపింయన్ షిప్ ను అందుకోవడంతో బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసి..
అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఛాంపియన్ గా నిలిచింది. ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. సాల్ట్ పదహారు పరుగులు చేసి అవుటయ్యాడు. విరాట్ కోహ్లి 43 పరుగులు చేసి అవుట్ కావడంతో ఇక స్కోరు పెద్దగా చేయదని, పంజాబ్ సులువుగా విజయం సాధిస్తుందన్న లెక్కలు వినిపించాయి. మయాంక్ 24 పరుగులు చేసి అవుటయ్యాడు. లివింగ్ స్టన్ 25 పరుగులు, జితేశ్ శర్మ 17 పరుగులకే అవుటయ్యారు. కృనాల్ పాండ్యా కూడా నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తక్కువ స్కోరు కావడంతో...
190 పరుగుల లక్ష్యమంటే పంజాబ్ కింగ్స్ ఊదేస్తుందని అనుకున్నారంతా. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కావడంతో ఇదేమీ పెద్ద స్కోరు కాదనిపించింది అందరికీ. కానీ ప్రియాంశ్ ఆర్య 24 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇంగ్లిస్ కూడా 39 పరుగులకే పరిమితమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఒక పరుగుకే అవుట్ కావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ లో ధైర్యం మరింత పెరిగింది. వధేరా పదిహేను పరుగులు చేశాడు. చివర వకూ శశాంక్ సింగ్ పోరాడినా ఫలితం లేదు. అప్పటికే కావాల్సిన రన్లు ఎక్కువ కావడం, బాల్స్ తక్కువగా ఉండటంతో ఇరవై ఓవర్లకు ఏడు వికెట్లుకోల్పోయి పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది ఛాంపియన్ గా నిలిచింది.
Tags:    

Similar News