రోహిత్-కోహ్లీ నెంబర్ 1 పోటీ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ అనంతరం కెరీర్లో తొలిసారి నంబర్వన్ ర్యాంకు అందుకున్న రోహిత్ శర్మ, తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ఫామ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో కోహ్లీ రెండో ర్యాంకుకు ఎగబాకాడు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో టాప్-5లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉన్నారు.