రింకు సింగ్ జట్టులోకి వచ్చేనా?

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్తుంది.

Update: 2023-06-06 08:49 GMT

ఐపీఎల్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న యువ క్రికెట‌ర్స్ కు భారతజట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. రింకు సింగ్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, జితేన్ శ‌ర్మ‌లు భారత జట్టులో భాగం కాబోతున్నారని సమాచారం. టీమ్ ఇండియా జూలై - ఆగ‌స్ట్‌లో వెస్టిండీస్‌తో టీ20, వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ కోసం కొందరు సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ కు సెలెక్ట‌ర్లు విశ్రాంతి నివ్వ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ వెస్టిండీస్ టూర్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నునందు. ఐపీఎల్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న రింకు సింగ్‌, య‌శస్వి జైస్వాల్‌ల‌కు వ‌న్డే, టీ20 జ‌ట్టులో చోటు ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ద్వారా మ‌రో ఐపీఎల్ స్టార్ మోహిత్ శ‌ర్మ కూడా టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం.వీరితో పాటు ఐపీఎల్‌లో రాణించిన శివ‌మ్‌మావి, రాహుల్ త్రిపాఠి, తుషార్ దేశ్‌పాండ్ పేర్ల‌ను సెలెక్ట‌ర్లు ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొనే యంగ్ ప్లేయ‌ర్స్‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉందని తెలుస్తోంది.

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్న సెలక్టర్లు ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రింకూసింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్‌శర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటివ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం.


Tags:    

Similar News