IPL 2025 : ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్లిన పంజాబ్ .. లక్నో కు మళ్లీ పరాజయమే

ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.

Update: 2025-05-05 02:06 GMT

ఐపీఎల్ సీజన్ 18లో ఇక ప్లే ఆఫ్ రేస్ ప్రారంభమయింది.ఈ రేసులో కొన్ని జట్లు వెనకబడుతుండగా మరికొన్నిజట్లు మాత్రం పుంజుకుని ప్లేఆఫ్ రేసులోకి తదూసుకొస్తున్నాయి. వాటిలో పంజాబ్ కింగ్స్ ఒకటి. పంజాబ్ కింగ్స్ తొలి నుంచి అన్ని మ్యాచ్ లలో నిలకడగా రాణిస్తూ పాయింట్లు సాధిస్తూ ప్లే ఆఫ్ రేసులో కొనసాగడానికి అవకాశాలను మరింత సులభతరం చేసుకుంది. ఇప్పటి వరకూ పంజాబ్ కింగ్స్ పదకొండు మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లలో విజయం సాధించింది. నాలుగింటిలో మాత్రమే ఓడిపోయింది. అదే లక్నో సూపర్ జెయింట్స్ కు లక్కు కలసి రావడం లేదు. పదకొండు మ్యాచ్ లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం ఐదు మ్యాచ్ లు ఆడి పది పాయింట్లతో సరిపెట్టుకుని ప్లే ఆఫ్ లోకి రావడానికి క్లిష్టతరం చేసుకుంది. నిన్న ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.

అదిరిపోయే ఇన్నింగ్స్...
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య వెంటనే అవుటయినా ప్రభ్ సిమ్రన్ మాత్రం విజృంభించాడు. ప్రభ్ సిమ్రన్ 91 పరుగులు చేశాడు. సెంచరీని తృటిలో మిస్ చేసుకున్నాడు. ఇంగ్లిస్ కూడా ధాటిగా ఆడటంతో ముప్ఫయి పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 45 పరుగులు చేసి హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన వధేరా పదహారు పరుగులు చేయడంతో పాటు, శశాంక్ నాటౌట్ గా నిలిచి 33 పరుగులు చేశాడు. ఇక స్టాయినిస్ ూడా పదిహేను పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం ఇరవై ఓవర్లలో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు ఇదే అత్యధిక స్కోరు అని చెప్పాలి.
ఆదిలోనే తడబడి...
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి లక్నో సూపర్ జెయింట్స్ ఆది నుంచి తడబడింది. మార్ క్రమ్ పదమూడు పరుగులకే అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ కూడా డకౌట్ అయి వెనుదిరిగాడు.పూరన్ కూడా ఎనిమిది పరుగులు చేసి అవుటయి ఇక విజయం కష్టమేనన్న పరిస్థితిని కల్పించాడు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై తీవ్రమైన వత్తిడి పెరిగింది. మరొక వైపు భారీ లక్ష్యం. ఇంపార్టెంట్ వికెట్లు అన్నీ పడిపోవడంతో పంత్ కూడా అలా వచ్చి పద్దెనిమిది పరుగులు చేసి వెళ్లిపోయాడు. బదోని మాత్రం నిలకడగా ఆడుతూ 74 పరుగులు చేసి జట్టుకు గౌరవమైన స్కోరు తెచ్చాడు. మిల్లర్ పదకొండు, సమద్ నలభై ఐదు పరుగులు, ఆవేశ్ ఖాన్ 19 పరుగుల చేయడంతో మొత్తం ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగారు ఫలితంగా లక్నో సూపర్ జెయింట్స్ కు మళ్లీ ఓటమి తప్పలేదు.
Tags:    

Similar News