టాస్ గెలిచిన టీం ఇండియా

భారత్ - న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇండియా టాస్ గెలిచింది. బ్యాటింగ్ ను ఎంచుకుంది.

Update: 2023-01-18 07:50 GMT

భారత్ - న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇండియా టాస్ గెలిచింది. బ్యాటింగ్ ను ఎంచుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతుంది. న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ యేయనుంది. మూడు మార్పులతో టీం ఇండియా బరిలోకి దిగనుంది.

మూడు మార్పులతో...
హార్థిక్ పటేల్, ఇషాన్ కిషన్ లు జట్టులోకి తీసుకుంది. భారత్ భారీ స్కోరు చేయగలిగితేనే న్యూజిలాండ్ పై గెలుపు అవకాశాలున్నాయి. భారీ స్కోరు చేయాలంటే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తో పాటు విరాట్ కొహ్లి మరోసారి తన బ్యాట్ ను ఝుళిపించాల్సి ఉంటుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరిది గెలుపు అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.


Tags:    

Similar News