అవును.. ఆ స్టార్ క్రికెటర్ దోషిగా తేలాడు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్‌

Update: 2023-12-30 02:23 GMT

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్‌ లామిచానేని(Lamichanne)ఖాట్మండూ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ కాదని వెల్లడించింది. జనవరి 10న లామిచానేకు శిక్ష ఖరారు కానుంది. గతేడాది ఆగస్టు 21న ఖాట్మండూలోని ఓ హోటల్‌లో లామిచానే తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి విచారణకు హాజారుకావాలని ఆదేశించారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న లామిచానే స్వదేశానికి తిరిగి రాకపోవడంతో నేపాల్ పోలీసులు ఇంటర్‌‌పోల్‌ను ఆశ్రయించారు. వారు లామిచానేను నేపాల్‌ పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు లామిచానేను దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. త్వరలో శిక్ష ఖరారు కానుంది. ఐపీఎల్ ఆడిన తొలి నేపాల్ క్రికెటర్‌గా లామిచానే. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తరపున అతడు బరిలోకి దిగాడు. మంచి ట్యాలెంట్ ఉన్న ఆటగాడు ఇలాంటి పాడు పని చేశాడని తెలియగానే క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

లామిచానే, 23, నేపాల్ లో అత్యంత పాపులర్ క్రికెటర్. న్యాయమూర్తి శిశిర్ రాజ్ ధాకల్‌తో కూడిన సింగిల్ బెంచ్ శుక్రవారం నాడు అతడు దోషిగా తేలాడని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఖాట్మండు పోస్ట్ నివేదించింది. తదుపరి విచారణ సమయంలో జాతీయ జట్టులోని సీనియర్ సభ్యునికి జైలు శిక్షను నిర్ణయిస్తుందని కోర్టు నివేదిక పేర్కొంది. లామిచానే ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. జనవరి 12న పటాన్ హైకోర్టు బెయిల్ పై క్రికెటర్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. లామిచానే దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తులు ధృవ రాజ్ నందా, రమేష్ దహల్‌లతో కూడిన సంయుక్త బెంచ్ షరతులతో కూడిన ₹2 మిలియన్ల బెయిల్ బాండ్‌పై లామిచానేని విడుదల చేయాలని ఆదేశించింది. ఇప్పుడు దోషిగా తేలడంతో లామిచానే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.



Tags:    

Similar News