దుమ్ము రేపిన కోహ్లీ.. ఆర్సీబీ క్వాలిఫికేషన్ ముంబై చేతుల్లో..!

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచి నిలిచింది.

Update: 2022-05-20 02:50 GMT

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచి నిలిచింది. ఫామ్ లేకుండా సతమతమవుతున్న మాజీ కెప్టెన్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ నిర్దేశించిన 169 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, కెప్టెన్ ఫా డుప్లెసిస్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేయడంతో ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రెండు వికెట్లు రషీద్ ఖాన్ తీశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. వృద్ధిమాన్ సాహా 31, మాథ్యూ వేడ్ 16 పరుగులు చేశారు. చివర్లో రషీద్ ఖాన్ 6 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన గుజరాత్‌కు ఇది నాలుగో ఓటమి. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో బెంగళూరు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి తిరిగి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ కూడా కీలకంగా మారనుంది. ఆ మ్యాచ్ లో ముంబై గెలిస్తే.. ఆర్సీబీ ఫైనల్ చేరుతుంది. ఓడిందంటే మాత్రం నెట్ రన్ రేట్ ఘోరంగా ఉన్న ఆర్సీబీ టోర్నమెంట్ నుండి అవుట్ అవ్వడం పక్కా..!


Tags:    

Similar News