ఆరంభ మ్యాచ్లో.. ఫైనల్ పోరులోనూ వారే తలపడుతున్నారు
మరో విషయమేమిటంటే.. ప్లేఆఫ్స్ మొదటి మ్యాచ్లోనూ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
Ahmadabad narendramodi stadium
ఐపీఎల్-2023 చివరి దశకు చేరుకుంది. ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్కు చేరుకుంది. ఐపీఎల్ 16వ సీజన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్తో ప్రారంభమైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. బదులుగా గుజరాత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 182 పరుగులు చేసి విజయం సాధించింది. అలా ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ తుది దశలో యాదృచ్చికంగా ఆ రెండు జట్లే చివరి మ్యాచ్(ఫైనల్స్)లో తలపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు.