ప్రణయ్ కు షాక్.. ఫైనల్ కు సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి

ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్ 1000లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్ ఫైనల్ కు చేరుకోలేకపోయాడు. సెమీఫైన‌ల్లో విక్ట‌ర్ అక్సెల్‌సెన్

Update: 2023-06-18 02:10 GMT

ఇండోనేషియాలో ఓపెన్‌లో భారతదేశానికి చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి సంచలన ప్రదర్శన చేసింది. పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లారు. హోరా హోరీగా సాగిన సెమీ ఫైనల్​లో ఏడో సీడ్‌ భారత జంట 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్​ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె జోడీని చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హ‌త సాధించింది. బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ టూర్​ సూపర్ 1000 ​టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరుకున్న మొద‌టి భార‌త జోడీగా సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి రికార్డు సృష్టించారు. ఈ సెమీస్ మ్యాచ్ ఏకంగా​ 67 నిమిషాల పాటు సాగింది. మొదటి సెట్‌ను భారత ద్వయం 17-21తో కోల్పోయింది. కానీ మిగతా రెండు సెట్లలో హోరాహోరీగా పోరాడి 17-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్ లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి టైటిల్ గెలుస్తారో లేదో చూడాలి.

ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్ 1000లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్ ఫైనల్ కు చేరుకోలేకపోయాడు. సెమీఫైన‌ల్లో విక్ట‌ర్ అక్సెల్‌సెన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. వ‌రుస‌గా ప‌దోసారి సూప‌ర్ 1000 ఫైన‌ల్‌కు చేరాల‌నుకున్న అత‌డికి నిరాశే మిగిలింది. హోరాహోరీగా జ‌రిగిన మ్యాచ్‌లో ప్ర‌ణ‌య్‌ 21-15, 21-15తో అనూహ్యంగా ఓట‌మి పాల‌య్యాడు. అంథోని సినిసికుల గింటింగ్ తో విక్ట‌ర్ టైటిల్ పోరులో త‌ల‌ప‌డ‌నున్నాడు. ఏడో సీడ్ ప్ర‌ణ‌య్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో మూడో సీడ్ కొడాయ్ న‌రోకాను ఓడించాడు. 55 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. 21-18, 21-16తో చిత్తు చేశాడు. అయితే సెమీ ఫైనల్ లో ఊహించని ఓటమి కారణంగా ప్రణయ్ ఫైనల్ కు వెళ్లలేకపోయాడు.


Tags:    

Similar News