ఫైనల్ లోకి పీవీ సింధూ

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింద బీడబ్ల్యూఎఫ్ ప్రపంచం టూర్ ఫైనల్ లోకి ప్రవేశించింది

Update: 2021-12-04 13:41 GMT

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింద బీడబ్ల్యూఎఫ్ ప్రపంచం టూర్ ఫైనల్ లోకి ప్రవేశించింది. ఈరోజు జరిగిన సెమీస్ లో జపాన్ క్రీడాకారిణి యమగూచిని ఓడించారు. దీంతో పీవీ సింధూ ఫైనల్ లోకి ప్రవేశించింది. మొత్తం మూడు సెట్లలో జరిగిన పోరులో పీవీ సింధూ 21-15, 15-21, 21-19 యమగూచిని మట్టికరిపించింది.

రెండోసారి...
ఆదివారం టైటిల్ పోరు జరగనుంది. దక్షిణ కొరియాకు చెందిన క్రీడాకారిణి సియోంగ్ తో సింధూ తలపడుతుంది. 2018లో ఈ టైటిల్ ను సింధూ గెలుచుకుంది. సింధూ ఫైనల్ లో విజయం సాధిస్తే బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్ లో పతకం మరో సారి సాధించినట్లవుతుంది.


Tags:    

Similar News