IPL 2025 : హైదరాబాద్ కథ ముగిసినట్లేనా? గుజరాత్ మళ్లీ కాలర్ ఎగరేసింది
అహ్మదా బాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీం పై విజయం సాధించింది
ఐపీఎల్ సీజన్ 18 ముగింపు దశకు చేరుకుంది. ఇక ప్లే ఆఫ్ రేసుకు ఏ జట్టు వస్తుందన్న దానిపై ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే రెండు మంచి టీంలు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోగా ఇప్పుడు తాజా ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ప్లే ఆఫ్ రేసుకు దూరమయిందనే చెప్పాలి. ఈ మూడు జట్లు గత సీజన్లో రఫ్ఫాడించాయి. చివరకు ఏ జట్టు ఫైనల్ కు వస్తుందా? అన్నంత రీతిలో సాగింది. కానీ అదే జట్లు. పెద్దగా మార్పులు లేకపోయినా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఈ జట్లు చతికలపడ్డాయి. నిన్న అహ్మదా బాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీం పై విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో సమిష్టిగా రాణించడంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు మరింత దూరంగా జరిగినట్లయింది.