దివ్య దేశముఖ్.. సరికొత్త చరిత్ర సృష్టించింది?

భారత చెస్‌ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య రికార్డు నెలకొల్పింది.

Update: 2025-07-24 10:05 GMT

భారత చెస్‌ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య రికార్డు నెలకొల్పింది. జార్జియాలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో దివ్య 1.5–0.5తో 2017 ప్రపంచ చాంపియన్‌, చైనాకు చెందిన టాన్‌ జోంగిపై గెలిచింది. బుధవారం జరిగిన రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 101 ఎత్తుల్లో టాన్‌ జోంగిని ఓడించి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో దివ్య వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి కూడా అర్హత సాధించింది. భారత్‌ కు చెందిన కోనేరు హంపి, చైనాకు చెందిన లె టింగ్జి మధ్య సెమీఫైనల్‌ విజేతతో ఫైనల్లో దివ్య ఆడుతుంది.

Tags:    

Similar News