హారికను ఓడించిన దివ్య.. తర్వాతి లక్ష్యం

మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

Update: 2025-07-22 12:30 GMT

మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికతో జరిగిన టైబ్రేక్‌లో 19 ఏళ్ల దివ్య 2–0తో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య రెండు గేమ్‌లు ముగిశాక స్కోరు 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌ నిర్వహించారు. సెమీఫైనల్స్‌ తొలి గేమ్‌లలో టింగ్‌జీ లె (చైనా)తో భారత్‌ కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి; టాన్‌ జోంగితో దివ్య తలపడతారు. భారత్‌ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెమీఫైనల్‌ చేరుకోవడంతో ఒక పతకం ఖాయమైంది. ప్రపంచకప్‌ టోర్నీలో టాప్‌–3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ చాంపియన్‌ ప్రత్యర్థిని నిర్ణయించే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తారు.

Tags:    

Similar News