దీప్తి శర్మ 3 కోట్ల 20 లక్షలు
భారత జట్టు మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారీ విలువ దక్కింది.
భారత జట్టు మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారీ విలువ దక్కింది. 2026 సీజన్ కోసం నిర్వహించిన మెగా వేలంలో దీప్తిని అత్యధికంగా 3 కోట్ల 20 లక్షలకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక మొత్తం 2023లో స్మృతి మంధానకు దక్కగా దీప్తి రెండో స్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా దిగ్గజం మెగ్ లానింగ్ను 1.9 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ తమ సారథిగా ఎంచుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్ విజయంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ 1 కోటి 30 లక్షలు ఇచ్చి తమ జట్టులోకి తీసుకుంది.