40 ఏళ్ల వయసులో బంగారు పతకం సాధించిన శరత్ కమాల్

టేబుల్ టెన్నిస్ లో అచంట శరత్ కమాల్ గోల్డ్ మెడల్ ను సాధించాడు.

Update: 2022-08-08 13:08 GMT

టేబుల్ టెన్నిస్ లో అచంట శరత్ కమాల్ గోల్డ్ మెడల్ ను సాధించాడు. మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు చెందిన లియామ్ పిచ్ ఫోర్డ్ ను 4-1తో ఓడించాడు. మొదటి గేమ్ లో లియామ్ పిచ్ ఫోర్డ్ రాణించినప్పటికీ మిగిలిన గేమ్స్ లో మాత్రం శరత్ కమాల్ దూకుడుగా ఆడాడు. 5 గేముల పాటూ సాగిన ఈ మ్యాచ్ లో శరత్ కమాల్ 11-13, 11-07,11-2, 11-6, 11-8 తో విజయాన్ని అందుకున్నాడు.

ఇక లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ లో పసిడి పతకం నెగ్గాడు. లక్ష్యసేన్ ఫైనల్లో మలేషియాకు చెందిన ట్సే యోంగ్ ఎన్జీపై విజయం సాధించాడు. తొలి గేమ్ ను 19-21తో కోల్పోయిన లక్ష్యసేన్ ఆ తర్వాత వరుసగా 21-9, 21-16తో రెండు గేములు చేజిక్కించుకుని కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించాడు.


Tags:    

Similar News