పంజాబ్ సీఎంపై డీజీపీకి ఫిర్యాదు.. మద్యంమత్తులో..

శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా భగవంత్ మాన్ పై ఇవే ఆరోపణలు చేసింది. ఈ నెల 14న వైశాఖి సంద‌ర్భంగా

Update: 2022-04-16 09:58 GMT

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై శనివారం డీజీపీకిి ఫిర్యాదు అందింది. మద్యంమత్తులో భగవంత్ మాన్ గురుద్వారాలోకి ప్రవేశించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ యువనేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా నేరుగా పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భగవంత్ మాన్ పై తానుు పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రతులను బగ్గా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

కాగా ..శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా భగవంత్ మాన్ పై ఇవే ఆరోపణలు చేసింది. ఈ నెల 14న వైశాఖి సంద‌ర్భంగా తాగిన మత్తు ఇంకా దిగ‌కుండానే గురుద్వారాలోకి ప్ర‌వేశించారంటూ శుక్రవారం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి భగవంత్ మాన్ క్షమాపణ చెప్పాలని ఎస్జీపీజీ డిమాండ్ చేసింది. భగవంత్ మాన్ పై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.





Tags:    

Similar News