సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.

Update: 2023-09-03 10:01 GMT

సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత...

ఆసుపత్రిలో చేరిక

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం,ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిని ఆమెను ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ఈ ఏడాదిలో ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12న సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల పాటు చికిత్స తీసుకుని జనవరి 17న డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 2న కూడా జ్వరంతో ఇదే ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ప్రతిపక్షాల కూటమి ఇండియా సమావేశానికి సోనియా గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపితో కలిసి ఆమె సమావేశాల్లో పాల్గన్నారు..

Tags:    

Similar News