ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలను సేకరించిన డిలీష్ పరేఖ్ కన్నుమూత

ఈ క్రమంలో.. 2634 పురాతన కెమెరాలను సేకరించినందుకు 2003లో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.

Update: 2023-02-03 08:19 GMT

photographer dilish parekh

ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలను సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ డిలీష్ పరేఖ్ (69) కన్నుమూశారు. ముంబైకి చెందిన డిలీష్ .. బుధవారం (ఫిబ్రవరి1) సాయంత్రం ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తాజాగా వెల్లడించారు. ఫ్రీలాన్స్ లెన్స్‌ మ్యాన్‌గా పనిచేసిన పరేఖ్‌కు భార్య బినీత, కుమారులు జై, హర్ష్ ఉన్నారు. ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరియర్‌ను ఆరంభించిన పరేఖ్‌కు కెమెరాలంటే విపరీతమైన పిచ్చి, వ్యామోహం. అందుకే కెమెరాల సేకరణను అలవాటుగా మార్చుకున్నారు.

ఈ క్రమంలో.. 2634 పురాతన కెమెరాలను సేకరించినందుకు 2003లో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. మరో పదేళ్లకు తన రికార్డును తానే బద్దలుగొట్టారు. 4,425 కెమెరాలను సేకరించినందుకు 2013లో మరోమారు గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 1977లో కెమెరాల సేకరణను అలవాటుగా మార్చుకున్న పరేఖ్.. ప్రపంచవ్యాప్తంగా వివిధ తయారీదారుల నుంచి వివిధ ఆకారాల్లో ఉన్న కెమెరాలను సేకరించడం ప్రారంభించారు.

డిలీష్ పరేఖ్ వద్ద లీకా, రోలిఫ్లెక్స్, జీస్, లినోఫ్, కెనాన్, నికాన్, కొడక్ కంపెనీల కెమెరాలున్నాయి. 1934లో జర్మనీ కంపెనీ తయారు చేసిన అత్యంత అరుదైన లీకా 250 కెమెరా కూడా ఉంది. దానితోపాటు మరో అరుదైన జర్మన్ తయారీ కెమెరా ‘బెస్సా II’ కూడా ఉంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత తేలికైన, చిన్నదైన కెమెరా ‘టెస్సినా ఎల్’ ను కూడా పరేఖ్ సేకరించారు. దాని బరువు కేవలం 155 గ్రాములు మాత్రమే కావడం గమనార్హం. పరేఖ్ తండ్రికి కూడా కెమెరాల సేకరణ అలవాటు ఉండటంతో.. ఆయన సేకరించిన 600 కెమెరాలను కుమారుడికి ఇచ్చారు.





Tags:    

Similar News