ఆపరేషన్‌ సింధూర్‌.. 3000 మంది అగ్నివీరుల సత్తా!!

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో భారత సైన్యం తమ సత్తాను పాకిస్థాన్ కు చూపించింది.

Update: 2025-05-22 09:33 GMT

operation sindhoor

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో భారత సైన్యం తమ సత్తాను పాకిస్థాన్ కు చూపించింది. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంది. ఈ ఆపరేషన్‌లో అగ్నివీరులు కూడా కీలక పాత్ర పోషించారు. ఆర్మీలోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలోని అగ్నివీరులు పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. గన్నర్లు, ఫైర్‌ కంట్రోల్‌ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణులు-గన్స్‌ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగా అగ్నివీరులు ఆపరేషన్‌లో భాగమయ్యారు.


ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థలో దాదాపు 150-200 మంది చొప్పున మొత్తంగా దాదాపు 3000 మంది అగ్నివీరులు ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పాల్గొన్నారు. సరిహద్దుల్లో పలు కీలక సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌ల్లో విధులు నిర్వర్తించారు.

Tags:    

Similar News