విదేశాల నుంచి భారత్ కు వచ్చేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఇకపై విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎలాంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని

Update: 2022-02-10 08:30 GMT

భారత్ లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ల తీవ్రత ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సవరించింది కేంద్రం. గతంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్న దేశాలను హై రిస్క్ దేశాలుగా పరిగణించింది కేంద్రం. తాజాగా ఈ కేటగిరీని తొలగించింది. అలాగే విదేశాల నుంచి వచ్చినవారు ఏడురోజులపాటు క్వారంటైన్లో ఉండాలన్న నిబంధననూ ఎత్తివేసింది.

ఇకపై విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎలాంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే వారు స్వీయ ధ్రువీకరణను ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఎయిర్ సువిధ పోర్టల్ లో ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. కరోనా నెగెటివ్ అంటూ ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్షా రిపోర్ట్ ను సమర్పించాలి. లేదంటే తాము రెండు డోసుల టీకా తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ నిబంధనలను పాటించిన వారినే ప్రయాణానికి అనుమతించాలని ఎయిర్ లైన్స్ సంస్థలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Tags:    

Similar News