కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఢిల్లీలో...?

జాతీయ కాంగ్రెస్ ఢిల్లీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్దమయింది.

Update: 2021-11-30 05:09 GMT

జాతీయ కాంగ్రెస్ ఢిల్లీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్దమయింది. రామ్ లీలా మైదానంలో ఈ సభను డిసెంబరు 12వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. పెరుగుతున్న పెట్రోలు ధరలు, దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. రామ్ లీలా మైదానంలో జరిగే ఈ సభలో సోనియా గాంధీతో పాటు ప్రియాంక, రాహుల్ కూడా పాల్గొంటారు.

అందరు నేతలు....
ఇప్పటికే పెరుగుతున్న పెట్రోలు ధరలు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఈ నెల 14 నుంచి 29 వరకూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జన జాగరణ్ అభియాన్ పేరుతో ర్యాలీలు నిర్వహించింది. వీటికి ముగింపుగా ఈ నెల 12వ తేదీన రామ్ లీలా మైదానంలో సభతో పాటు నిరసన ప్రదర్శన కూడా చేయాలని నిర్ణయించింది. ఈ సభకు కాంగ్రెస్ నేతలందరికీ ఆహ్వానాలు అందాయి.
.


Tags:    

Similar News