లండన్ లో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
లండన్ లో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తగిలింది
లండన్ లో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వానికి తనను అప్పగించవద్దని కోరుతూ నీరవ్ మోదీ లండన్ కోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం మాత్రం ఈ పిటీషన్ ను తోసిపుచ్చింది. పీఎన్బీ కేసులో నీరవ్ మోదీ భారత్ నుంచి తప్పించుకుని వెళ్లి గత కొంతకాలంగా తలదాచుకుంటున్నాడు.
భారత్ కు రప్పించేందుకు...
అయితే నీరవ్ మోదీని భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో నీరవ్ మోదీ లండన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను భారత ప్రభుత్వానికి అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ వేసిన పిటీషన్ ను లండన్ కోర్టు తిరస్కరించింది.దీంతో భారత ప్రభుత్వానికి నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.