48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేయాలని నిర్ణయించింది.

Update: 2022-11-26 03:46 GMT

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు మేఘాలయ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాల్లో ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారు. శాంతిభద్రతలను పరిరక్షించే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకుంది.

శాంతి భద్రతల దృష్ట్యా....
అసోం - మేఘాలయ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల కారణంగా ఆరుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్ , నైరుతి ఖాసీ హిల్స్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే మరింత సమయం ఇంటర్నెట్ సేవలను బంద్ చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News