మీడియా ముందుకు మల్లోజుల

మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు

Update: 2025-10-15 04:29 GMT

మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో అరవై మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈరోజు గడ్చిరోలి పోలీసులు మల్లోజుల వేణుగోపాల్ తో పాటు అరవై మంది మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా చెలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఉద్యమానికి భారీ దెబ్బఅని అంటున్నారు.

ముఖ్యమంత్రి ఎదుట...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఆయనపై వంద కేసులున్నాయి. కోటి రూపాయల రివార్డు ఉంది. మల్లోజుల వేణుగోపాల్ అతని బృందం లొంగుబాటుతో గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమానికి భారీగా దెబ్బపడినట్లేనని అంటున్నారు.


Tags:    

Similar News